పాండిచేరిలోని రాజ్ నివాస్ పాండిచేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ ప్రస్తుత అధికారిక నివాసం. దీనికి హిందీలో ప్రభుత్వ నివాసం అని అర్ధం ఉంది. రాజ్ నివాస్ ఒకప్పుడు పాండిచేరిలోని ఫ్రెంచి గవర్నర్ జోసెఫ్ ఫ్రాంకోయిస్ డుప్లెక్స్ నివాసంగా ఉండేది. అత్యంత చారిత్రిక ప్రాముఖ్యత కల్గిన రాజ్ నివాస్ శతాబ్దాల కాలంతో పాటు పాండిచేరిలో సామాజిక - రాజకీయ, సాంస్కృతిక మార్పులను చవి చూసింది. ప్రస్తుతం రాజ్ నివాస్ లో పాండిచేరి ప్రస్తుత గవర్నర్ డా. ఇక్బాల్ సింగ్ ఉంటున్నారు.