పాండిచేరి కు గవర్నర్ గా 1742 నుండి 1754 వరకు పనిచేసిన జోసెఫ్ ఫ్రాంకోయిస్ డుప్లెక్స్ విగ్రహం బీచ్ రోడ్డులో ఉంది. ఇది పాండిచేరి లోని పిల్లల పార్క్ లోపల ఉంది. 2.88 మీటర్ల ఎత్తైన ఈ విగ్రహం పార్క్ లోని దక్షిణపు వైపున ఉంది. అతని సేవలను అధికారికంగా గుర్తించిన ఫ్రెంచి ప్రభుత్వం 1870 లో దీనిని నెలకొల్పింది. ఇదే కాలంలో ఫ్రెంచి వారు మరొక విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ విగ్రహం గోబెర్ట్ అవెన్యూలో ఉంది.
వలసల ప్రారంభ కాలంలో ఫ్రెంచి సామ్రాజ్యంలో ఒక అంతర్గత భాగమైన ఈ దివంగత గవర్నర్ భారతదేశంలో ఫ్రెంచి పాలనను స్థాపించడానికి ఎంతగానో కృషి చేయడమే కాక యోగ్యపాలకునిగా కూడా ప్రసిద్ధి చెందాడు. పాండిచేరి సందర్శించే వారికి ఈ విగ్రహం, ఇది ఉన్న పిల్లల పార్కు తప్పనిసరిగా చూడవలసినదిగా సూచించబడింది.