అప్పట్లో ఈ ప్రాంతానికి అధికారిగా ఉన్న డేనిష్ గవర్నర్ అధికార నివాసంగా ఉండేందుకు ఈ భవంతిని 1784లో నిర్మించారు. ఇప్పుడది పూంపుహార్ లో తమిళనాడు పర్యాటక శాఖ కార్యాలయంగా పనిచేస్తోంది. ప్రజల సందర్శనార్ధం తెరిచిఉంచే ఈ భవంతి డేనిష్ నిర్మాణశైలికి అద్భుతమైన తార్కాణం. పూంపుహార్ లోని ప్రఖ్యాత చారిత్రిక భావంతులలో ఇదిఒకటి. పూంపుహార్ లో కల్లా అతిపెద్ద భవంతి కూడా ఇదే. పూంపుహార్ లో తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం ఇది. పూంపుహార్ లో విదేశీ పాలన ఆనవాలుగా ఉండిపోయిన ఈ భవంతి ఏడాది పోడవునా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ కోస్తాతీర పట్టణంలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణ కావటంవల్ల డేనిష్ గవర్నర్ భవంతిని తేలికగానే గుర్తుపట్టవచ్చు.