పూంచ్ కి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో చిన్న కొండపైన ఉన్నది ఈ గురుద్వారా నంగాలి సాహిబ్. ద్రుంగాలి కాలువ గట్టుపైన ఉన్నటువంటి ఈ గురుద్వారా సిక్కులకి ఎంతో పురాతనమైన ఆధ్యాత్మిక కేంద్రం. వేయి మంది కంటే ఎక్కువ భక్తులు ప్రతి సంవత్సరం తమ ప్రార్ధనలు జరుపుకోవడానికి ఈ ప్రదేశానికి వస్తారు.
ఠాకూర్ భాయ్ మేలా సింగ్, సాంట్ భాయి ఫెరూ సింగ్ యొక్క నాలుగవ వారసుడు, చే 1803 లో నిర్మింతమైంది. ఎల్లవేళలా భక్తులతో ఈ గురుద్వారా అలరారుతూ ఉంటుంది. మొదటి సింగ్ రాజుల వంశీకుడైన మహారాజా రంజిత్ సింగ్ 1814 లో ఇక్కడికి వచ్చాడు. 1823 లో ఈ గురుద్వారాన్ని నాలుగు గ్రామాలతో అనుసంధానించాడు. ఈ గురుద్వారా భవనం 70 గదులతో ఒక పెద్ద హాల్ తో కమ్యూనిటీ కిచెన్ తో ఉంటుంది.
మహాత్ బచితర్ సింగ్, 1947 సమయంలో ద్వంసం అయినటువంటి ఈ గురుద్వారా ని పునర్నిర్మితం చేసాడు. ప్రతి ఆదివారం ఈ ప్రదేశం లో భక్తులు సమూహంగా ప్రార్ధనలు చేస్తారు. బైసఖి అనే ప్రత్యేకమైన సిక్కుల పండుగ ప్రతి సంవత్సరం ఇక్కడ జరపబడుతుంది.