పూంచ్ కి సుమారుగా 35 కిలోమీటర్ల దూరం లో ఉన్న అందమైన చిన్న పల్లె లోరన్. ఇది ఒక ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం. పీర్ పంచాల్ పర్వతాల పాద ప్రాంతంలో ఉండటం ఇంకా లోరన్ నీటి ప్రవాహాలతో ఈ ప్రదేశాలతో ఆకర్షణీయంగా ఉంటుంది. 1542 వరకు లోరన్, పూంచ్ కి రాజధానిగా హిందూ రాజుల కాలంలో వ్యవహరించింది. లోరన్ కోట గా ప్రసిద్ది చెందిన ఈ ప్రదేశంలో పర్యాటకులు ఇప్పటికీ ఆ కోట శిధిలాలు చూడవచ్చు. ఒకానొకప్పుడు ఈ కోట 'గేట్ వే ఆఫ్ కాశ్మీర్' గా పేరుపొందింది.