పూంచ్ కి 20 కిలోమీటర్ల దూరంలో, గాగ్రి మరియు పులస్త నదీ సంగమ ప్రాంతంలో ఉన్న అందమైన ప్రదేశం మండి అనే చిన్న గ్రామం. స్వామి బుద్ధ అమర్నాథ్ జీ మందిరం వల్ల ఈ ప్రదేశం ఆధ్యాత్మిక పరంగా గొప్ప విశిష్టత పొందింది. ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల పర్యాటకులు ఈ ప్రదేశాన్ని ఇష్టపడతారు.