పూంచ్ ఫోర్ట్ లేదా పూంచ్ ఖిలా అనేది పూంచ్ పట్టణం లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ. 16 శతాబ్దానికి చెందిన ఈ ఫోర్ట్ ప్రాచీనమైనది. 1713 లో పూంచ్ రాజ రుస్తం ఖాన్ చే నిర్మించబడిన ఈ కోట మొఘలుల యొక్క నిర్మాణ శైలి తో ప్రభావితమైనది. ఈ కోటని నిర్మాణం కొన్ని సంవత్సరాలు కొనసాగింది.
సిక్కుల హయంలో ఈ కోట యొక్క ముఖ్యవిభాగం లో సిక్ఖుల నిర్మాణ శైలిలో కొన్ని మార్పులు చేసారు. ఈ కోట యొక్క ముఖ విభాగాన్ని ఇంకా అందంగా మార్చడానికి పూంచ్ యొక్క దోగ్ర రాజ్యాన్ని స్థాపించిన రాజా మోతీ సింగ్ యూరోప్ నుండి నిపుణులని నియమించాడు.