పూంచ్ పట్టణములో ఉన్నటువంటి ఈ మందిరం పూంచ్ జిల్లాలోని ప్రసిద్ది చెందిన దేవాలయాల్లో ఒకటి. 1760 లో ప్రసిద్ద ఆధ్యాత్మిక గురువు స్వామి జవహర్ గిరి జి ఇక్కడికి వచ్చారు. రుస్తం ఖాన్, అప్పటి పూంచ్ చక్రవర్తి స్వామీజీ కి తన నివాళులు అర్పించడానికి ఈ ప్రదేశానికి వచ్చారు. స్వామిజి గౌరవార్ధం ఆ రాజు మరికొంత స్థలాన్ని ఈ మందిరానికి కానుకగా అందించారు.
స్వామీజీ 1787 లో తను సమాధి అయ్యేంతవరకు ఇక్కడనే నివసించారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సమాధిని భక్తులు సందర్శించుకుంటారు.
ఆ తరువాత ఇంకా ఎందరో ఆధ్యాత్మిక గురువులు ఇక్కడికి వచ్చారు. వారిలో గొప్ప సంసృత పండితులైన స్వామి షమయానంద్ జీ ఇక్కడికి వచ్చి ఒక సంస్కృత పాఠశాల ను ఈ మందిరం యొక్క ప్రాంగణం లో మొదలు పెట్టారు. స్వామి శంకర్య నంద్ గిరి జి, స్వామి పరమానంద్ జి మరియు స్వామి సత్యానంద సరస్వతి వంటి ఆధ్యాత్మిక గురువులు ఇక్కడ నివసించారు.
స్వామి సత్య దేవ్ జి ప్రస్తుతం ఈ మందిరం యొక్క అధిపతిగా వ్యవహరిస్తున్నారు. చారి ముబారక్ లేదా హోలీ మేస్ వంటి పండుగ ప్రతి సంవత్సరం ఏంతో భక్తీ శ్రద్దలతో రక్షాబంధనం రోజు ఇక్కడ జరుపుకుంటారు.