సెయింట్ సఖి పీర్ చోటా షా అనే ఇస్లాం సెయింట్ కి అంకితమివ్వబడినది ఈ మందిరం. మెంధర్ పట్టణం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సఖి మైడెన్ గ్రామంలో ఈ మందిరం ఉంది. ఈ జిల్లాలో ఉన్న అతి పవిత్రమైన మందిరాలలో ఈ మందిరం ఒకటి. హిందువులు మరియు ముస్లిములు కలిసి ప్రార్ధించుకునే మందిరం ఇది. సెయింట్ జ్ఞాపకార్ధం ప్రతి సంవత్సరం మూడు రోజులు ఉర్సు పండుగ ని జరుపుకుంటారు.