సెయింట్ ఇల్లహి బక్ష్ సాహిబ్ అనబడే ప్రఖ్యాత సూఫీ సెయింట్ మందిరం ఇది. పూంచ్ పట్టణం నుండి 37 కిలోమీటర్ల దూరంలో ఉన్న బట్టల్కొట్ గ్రామంలో ఈ మందిరం ఉంది. పీర్ పంచాల్ పర్వత శ్రేణులు అలాగే నైన్ సుఖ్ మరియు నంది శూల్ నదుల సంగమంల మధ్యలో ఉన్న అందమైన గ్రామం బట్టల్కొట్. దట్టమైన అడవులు, అందమైన పర్వతాలు, జొన్న పంటలు అందమైన నీటి ధారల మధ్య ఈ గ్రామం చూడముచ్చటగా ఉంటుంది.
1948 ఇక్కడికి విచ్చేసిన జిఅరాట్ సైన్ ఇల్లహి భక్షి సాహిబ్ ఇక్కడికి నివసించారు. మే 16 న తుది శ్వాస విడిచారు. అతని మరణానికి నాలుగు రోజుల ముందర తన అనుచరాలకి తను తుది శ్వాస విడువబోతున్నట్లు తెలిపారు. తనని ఎక్కడ సమాధి చేసేది వారికి తెలిపారు. అలాగే మూడు రోజుల పాటు తన శరీరాన్ని ప్రజల దర్శనార్ధం ఉంచమని కోరారు. సూఫీ సెయింట్ గా, ప్రీచర్ గా మానవుల కోసం ఎన్నో సందేశాలు అందించారు. సోదరభావం, ప్రశాంతత మరియు ప్రేమలని పంచే సందేశాలు అందించారు.
సెయింట్ సాహిబ్ జ్ఞాపకార్ధం ప్రతి సంవత్సరం మే లో ఉరుసు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనడానికి కుల మతాలకు అతీతంగా అత్యధికమంది భక్తులు తరలి వస్తారు. వారసత్వపు సంస్కృతుల సమ్మేళనానికి ప్రతీకగా ఈ వేడుకలో ముస్లిములతో పాటు హిందువులు కూడా పాల్గొంటారు.