కీర్తి మందిర్ భవనంలో మహాత్మా గాంధి జన్మించారు. మోహన్దాస్ కరంచంద్ గాంధి మూడు అంతస్తులు కలిగిన ఈ పోర్ బందర్ బ్లూ హవేలీ లో 1869 అక్టోబర్ 2 నాడు జన్మించారు. ఇపుడు ఇది కీర్తి మందిర్ గా ప్రసిద్ధి చెందినది. ఇపుడు దీనిని మ్యూజియంగా మార్చి గాంధీ జీవిత విశేషాలతో కల ఫోటోలు, వస్తువులు ఉంచారు. గాంధి ఫిలాసఫీ, సాధన లకు సంబంధించిన కొన్ని పుస్తకాలతో ఒక అందమైన లైబ్రరీ కూడా నిర్వహిస్తున్నారు.