ముంబై - గోవా జాతీయ రహదారిపై మాపూసా క్రాస్ చేసిన తర్వాత పనాజిం ప్రవేశంలోనే పోర్వోరిం లేదా ఆల్టో పోర్వోరిం దర్శనమిస్తుంది. గోవా విశ్రాంతి సెలవులలో ఈ ప్రదేశం మీకు ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. టవున్ కు వెలుపల సలీం ఆలీ బర్డ్ శాంక్చురీ ఉంటుంది. ఇది ఫొటోగ్రాఫర్లకు ప్రియమైనది.
మరింత ముందుకు పనాజిం వైపు వస్తే, మండోవి నది ఒడ్డున రీస్ మేగోస్ ఫోర్ట్ చూడవచ్చు. ఇటీవలే దీనిని పునరుద్ధరించారు. ఈ ఫోర్టు నుండి పనాజిం వైపుగల నది అద్భుతంగా కనపడుతుంది. ఇక్కడ అనేక ఫెర్రీ బోట్లు మరియు చిన్న నావలు ఉండి మీకు సూర్యాస్తమయ సమయాన్ని మరింత ఆహ్లాదంగా చేస్తాయి.
పోర్వోరిం ధనికులు ఉండే నివాస ప్రదేశం. పనాజిం కు గ్రామీణ ప్రాంతం. పనాజిం బ్రిడ్జి దాటితే చాలు మీరు పనాజిం చేరినట్లే.
ఇక్కడే కేజురియో అనే రెస్టరెంటు మరియు మేజస్టిక్ అనే పేస్ట్రీ షాపు బాగా పేరు పడిన తినుబండార ప్రదేశాలు. కనుక మీరు తప్పక ఈ రెండిటి రుచి చూడవలసిందే. పోర్వోరింలో వసతులు కూడా చాలా తక్కువ ధరలలో దొరుకుతాయి. పక్కనే వున్న కండోలిం మరియు బాగాల కంటే కూడా ఇక్కడ వసతి చౌకగా ఉంటుంది. అంతేకాదు, వాటికి దగ్గరగా కూడా ఉంటుంది.