కాలేశ్వర మహాదేవ ఆలయం, హిమాచల ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రా జిల్లా లో ఉన్న పురాతన ఆలయం. ప్రాగ్ పూర్ గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం శివునికి చెందింది. ఈ ఆలయంలో శివునికి ప్రతిరూపమైన ఒక ప్రత్యేక లింగం నేలమట్టానికి ఎంతో దిగువగా ఉంటుంది. ఈ ఆలయ గోడలు అద్భుతమైన కట్టడాలతో అలంకరించబడి, అనేక పురాతన సమాధులు ఉన్నాయి. చింతపూర్ని మాత మహా రుద్రాగా కూడా ఈ ఆలయం ప్రసిద్ది చెందింది.