మహారాణ ప్రతాప్ సాగర్ డాం, ప్రాగ్పూర్ నగరంలో బియాస్ నది పై నిర్మించిన పేరొందిన డాం. 45000 హెక్టార్ల మేర చిత్తడిలో వ్యాపించి ఉన్న ఈ డాం 450 మీటర్ల ఎత్తులో ఉంది. దీనిని రామ్సర్ సదస్సులో భారతదేశంలో ఉన్న 25 అంతర్జాతీయ చిత్తడి ప్రదేశాల్లో ఒకటిగా ప్రకటించారు. ఈ డాంకు ప్రసిద్ధ భారత యుద్ధ వీరుడు మహారాణ ప్రతాప్ పేరు పెట్టారు. పాంగ్ డాం సరస్సు లేదా పాంగ్ జలాశయంగా కూడా పిలిచే దీనిని 1975 లో నిర్మించారు, ఈ ప్రాంతానికి వచ్చే అనేక వలస పక్షుల కారణంగా తర్వాతికాలంలో దీన్ని వన్యప్రాణి అభయారణ్యంగా ప్రకటించారు.
ఈ జలాశయానికి వలస వచ్చే పక్షులలో దాదాపు జాతులు సైబీరియ, మధ్య ఆసియా నుండి వస్తాయి. సుర్ఖాబ్, కొంగలు, పింటైల్స్ ఈ వన్యప్రాణి అభయారణ్యంలో కనబడే పేరొందిన వలస పక్షులలో కొన్ని. సంభార్, అరిచే లేడి, అడవి పందులు, చిరుతలు వంటి జంతువులూ సమృద్ధిగా ఈ ప్రాంతంలో కనబడతాయి. పాంగ్ జలాశయం రాష్ట్రంలో చేపలు పట్టే ప్రధాన ప్రాంతం కూడా.