ప్రాగ్ పూర్ లోని జడ్జి కోర్టు, భారత-ఐరోపా శైలికి ప్రసిద్ది చెందిన ఒక పెద్ద పల్లెటూరి భవంతి. 1918 లో సర్ జై లాల్ ఆశయం మేరకు నిర్మించారు. 12 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ భవంతిని ప్రస్తుతం ఒక వారసత్వ హోటల్గా మార్చారు. ఈ ప్రాంతంలో లిచీ, రేగు, మామిడి, ఇతర నిమ్మజాతుల పళ్ళ చెట్లు అనేకం ఉన్నాయి. ఇంతేకాక, కర్పూరం, లవంగం, యాలుకలు మొక్కలు ఇతరాలతో బాటుగా ఈ ప్రాంగణంలో కనబడతాయి.
ఈ ప్రాంగణంలో ఉన్న ఒక డైరీ నుండి ఈ భవనానికి పాలు సరఫరా చేస్తారు. ఈ భవంతికి సంబంధించిన మరొక ఆసక్తికర అంశం దీనికి ఒక వంశపారంపర్య పర్వత బుగ్గ నుండి నీరు రావడం.