తమిళ భాషలో పళావేర్కాడు ఏరి అని పిలువబడే పులికాట్ సరస్సు భారత దేశంలోని రెండో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. తమిళనాడు, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో వున్న ఈ ప్రాంతం దక్షిణ భారతం నుంచి ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఒక ద్వీపంగా వుండే శ్రీహరికోట ఈ సరస్సును బంగాళా ఖాతం నుంచి వేరు చేస్తుంది.
జంతు, పక్షుల జాతులు సమృద్ధిగా వుండే పులికాట్ సరస్సు చేపల వాణిజ్యానికి కూడా ప్రసిద్ది. ఆరనణి, కాళంగి, స్వర్ణముఖీ అనే మూడు నదుల నుంచి ఈ జలాశయానికి నీరు చేరుతుంది. జీవవైవిధ్యం, అద్భుతమైన ప్రాకృతిక సౌందర్యం ఈ ప్రాంతాన్ని తప్పక చూడాల్సిన ప్రాంతంగా చేస్తాయి.
ఈ సరస్సులో అనేక జాతుల చేపలు, అరుదైన పక్షి జాతులు, సరీసృపాలు, నీటి మొక్కలు ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి వచ్చే పెలికాన్ పక్షుల కోసం పర్యాటకులు ప్రధానంగా ఇక్కడికి వస్తారు. అక్టోబర్ నుంచి మార్చి మధ్య కాల౦లో ఈ సరస్సు సందర్శనకు ఉత్తమ సమయం.