రత్నగిరి కొండ పై 1687 లో నిర్మించిన సావిత్రి దేవాలయం ఒంటరిగా ఉన్న బ్రహ్మ దేవుని భార్య సావిత్రి కి చెందినది. పుష్కర్ కు వచ్చినప్పుడు అమ్మవారు కొండ పై విశ్రాంతి తీసుకొందని విశ్వసిస్తారు.తన భర్త గాయత్రి అనే స్థానిక అమ్మాయిని అప్పటికే వివాహం చేసుకోవడంతో ఆమె బ్రహ్మదేవుని తో కల్సి పూజలందు కోవడానికి నిరాకరించింది. ఈ దేవాలయానికి కొండ ల మధ్య నుండి ఒక దారి ఉంది, ఇక్కడికి చేరడానికి దాదాపు ఒక గంట సమయం పడుతుంది. ఇది బ్రహ్మ దేవాలయానికి వెనుక ఉంది. ఇక్కడి నుండి సరస్సు దాని పరిసర గ్రామాల అందమైన దృశ్యాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి.