గోవాలోని క్యూపెం పట్టణం కు సమీపంలో ఒక వ్యక్తి రెండు స్తంభాలతో ఇల్లు కట్టాడట. మరోమారు మంచివారుగా మారిపోవాలనుకునే నేరస్తులు ఈ రెండు స్తంభాల మధ్య నుండి నడచి కొత్త జీవితం మొదలు పెట్టాలని ప్రకటించాడు. క్యూపెం వ్యవస్ధాపకుడు జోస్ పౌలో పలాషియా డో డీఓ భవనం సుమారు రెండు శతాబ్దాల కిందట నిర్మించాడు.
అది ఒక బ్రహ్మాండమైన పర్యాటక ఆకర్షణగా నేడు తయారైంది. ఈ భవనంలో భారతీయ మరియు పోర్చుగీసు కళా నైపుణ్యం కనపడుతుంది. రెస్టరెంట్ నుండి లైబ్రరీ వరకు హిందూ శైలి కేధలిక్ ఛాపెల్ ప్రవేశంలో కనపడుతుంది. మధ్యాహ్నాలు ఈ ప్రదేశాన్ని బాగా ఆనందించవచ్చు. గోవా ఆహారాలు తినవచ్చు. పలాఝియో డో దేఓ పోర్చుగీసు కాలాన్ని ప్రతిబింబిస్తుంది.
ఇదే ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన హోలీ క్రాస్ చర్చిని చూడటం కూడా మరువకండి.
పలాషియో డో డీఓ మార్గోవానుండి 6 కిలోమీటర్ల దూరంలో కల క్యూపెంలో కలదు. అద్దె కారులో పనాజిం, మార్గోవా లేదా వాస్కోడా గామాలనుండి చేరవచ్చు. ప్రత్యామ్నాయంగా, ఒక బైక్ అద్దెకు తీసుకొని పర్యటించవచ్చు.