రాయ్ పూర్ గొప్ప సెలవ దినాలను గడిపే ఈ ప్రాంతంలోని ప్రదేశాలలో ఒకటి. అందువల్ల పర్యాటకులు ఈ నగరంలోని పర్యాటక కార్యక్రమాల పరిధిని మర్చిపోతారు, రాయ్ పూర్ విదేశీయులు, ఇతర పర్యాటకులలో ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాయ్ పూర్ లో సామర్ధ్యం గల పర్యాటకులకు అనేక రకాల ఆకర్షణలు ఉన్నాయి. దూధాధరి ఆశ్రమం, మహంత్ ఘసిదాస్ మ్యూజియం, వివేకానంద సరోవరం, వివేకానంద ఆశ్రమం, శాదని దర్బార్, ఫింగేశ్వర్ వంటివి వాటిలో కొన్ని. ఈ నగరం నిర్మాణాత్మక స్మారక కట్టడాలకు, ప్రపంచం మొత్త౦లోని పర్యాటకులను ఆకర్షించే శిధిలమైన పాత భావనలకు కూడా పేరుగాంచింది.
నగర నడిబొడ్డున ఉన్న నగర్ ఘడి అంటే పాటలు పాడే గడియారం, గంటకొకసారి గంట మొగేముందు ఛత్తీస్గడ్ లోని స్థానిక గ్రామీణ సంగీతాన్ని వినిపిస్తుంది. అన్ని సాధనాలు సోలార్ ఎనర్జీతో పనిచేసే ఉర్జ భవన్ & రాజీవ్ గాంధీ వాన్ ఇతర ఆశక్తికర ప్రదేశాలు.
పలరి, షహీద్ స్మరాక్ భవన్, మహావీర్ పార్క్, పుఖుటి ముక్తంగన్ మ్యూజియం, మహాకోషల్ కళా పరిషద్, చంద్రఖురి, గిరోద్పురి మొదలైనవి ఈ ప్రాంతంలోని ఇతర ఆకర్షణలు.
రాయ్ పూర్ చరిత్రపై చిన్న దృష్టి
రాయ్ పూర్ నగరం ఒకప్పుడు మధ్యప్రదేశ్ లో ఒక భాగం, అది ఇండోర్ తరువాత రాష్ట్ర ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉంది. ఈ స్థల ఆదాయానికి వ్యవసాయ ప్రక్రియ, స్టీల్, సిమెంట్, అల్లోయ్, పోహా, బియ్యం ప్రధాన మూలం. ఇప్పుడు ఈ నగరం బొగ్గు, విద్యుత్, ప్లైవుడ్, ఉక్కు, అల్యూమినియం వంటి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల కారణంగా ఛత్తీస్గఢ్ లో ఒక పారిశ్రామిక కేంద్రంగా ఉద్భవించింది.
రాయ్ పూర్ లోని ప్రజలు, సంస్కృతి
రాయ్ పూర్ నివాసులు ఛత్తీస్గర్ ల సంప్రదాయాన్ని కలిగి ఉంటారు, దేశంలోని ఈశాన్య ప్రాంతంనుండి కేవలం కొద్దిమంది ప్రజలతో దక్షిణ, ఉత్తర భారతదేశ౦ నుండి వచ్చినవారు ఉంటారు. ఈ నగరం ఒడిష (ఒరిస్సా) కి దగ్గరగా ఉండడం వల్ల, ఈ ప్రాంతంలో ఒరియా ని సాధారణ భాషగా వాడతారు. హరేలి పండుగ, పోలా పండుగ, తీజ పండుగ వంటి స్థానిక పండుగలను రాయ్ పూర్ లో ప్రధాన పండుగాలుగా జరుపుకుంటారు.
రాయ్ పూర్ చేరుకోవడ౦ ఎలా
రాయ్ పూర్ ఛత్తీస్గడ్ లోని ఇతర ప్రధాన నగరాలకు, అలాగే సమీప రాష్ట్రాలకు బాగా అనుసంధానించబడి ఉంది.