మధ్య ప్రదేశ్ లోని చిన్న పట్టణాలలో రైసేన్ ఒకటి. ఇది చిన్నది అయినప్పటికీ గణనీయమైన మతపర చారిత్రిక ప్రాధాన్యతను కలిగి వున్నది. ఇది రైసేన్ జిల్లాలో కలదు. ఇక్కడ కల ఒక కొండపై రైసేన్ అనే ఒక కోట పేరు మీదుగా రైసేన్ పేరు జిల్లాకు మరియు టవున్ కు పెట్టారు. దీనిని గతంలో రాజ వాసాని లేదా రాజసాయన్ అంటే రాజుల నివాసం అని అర్ధం గా వాడేవారు.
రైసేన్ చరిత్ర చూస్తె
పట్టణం ప్రతి మూలలోను దాని చరిత్ర కనపడుతుంది. క్రి. శ. 1200 లలో రైసేన్ కోట కట్టారు. అప్పటి నుండి రైసేన్ అనే పేరు ఏర్పడినది. 15 వ శతాబ్దం వరకు రైసేన్ ను వివిధ వంశాలు పాలించాయి. 1543 లో షేర్ షా సూరి దీనిని పురాన్ మల్ నుండి స్వాధీనం చేసుకొని చాలా కాలం పాలించాడు. అయితే 1760 లో భోపాల్ నవాబు దీనిని హస్త గతం చెసుకున్నాదు. అప్పటినుండి ఇది భోపాల్ రాష్ట్రం లోనే వున్నది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1 నవంబర్ 1956 నాడు భోపాల్ రాష్ట్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చెసారు.
రైసేన్ లో ఏమి చూడాలి ?
రైసేన్ లో చూసేందుకు అనేక టెంపుల్స్ , క్షేత్రాలు కలావు. టెంపుల్స్ తో పాటు మసీదులు కూడా వుండి మత పర సహనాన్ని చాటుతున్నాయి. హజరత్ పీర్ ఫతెహుల్లా షా బాబా దీనికి నిదర్శనం. రైసేన్ ఫోర్ట్ ఈ ప్రదేశం లో ప్రధాన ఆకర్శన.
రైసేన్ సందర్శన
రైసేన్ సందర్శనకు ఆహ్లాదకర వాతావరణం కల అక్టోబర్ లేదా నవంబర్ నెలలు అనుకూలం. రోడ్డు రైలు వాయు మార్గాలలో రైసేన్ చెరవచ్చు. దీనికి సమీప రైలు స్టేషన్ మరియు ఎయిర్ పోర్ట్ లు భోపాల్ లో కలవు.