చిత్రాంగి భవన్ కు గొప్ప చాళుక్య రాజు అయిన రాజ రాజ నరేంద్ర యొక్క రెండవ భార్య చిత్రాంగి పేరును పెట్టారు. ఇది తన భార్య కోసం రాజు నిర్మించాడు,మరియు ఇది గోదావరినది ఒడ్డున ఉంది. ఇది ప్రసిద్ధ రచయిత చలం నివాసానికి చాలా దగ్గరగా ఉంది. పురాణం ప్రకారం,చిత్రాంగి రాజ రాజ నరేంద్ర కుమారుడు భార్య గా ఉండాలని భావించింది.
కొన్ని కార్యక్రమాలను చెయ్యడానికి, రాజు ని వివాహం చేసుకుంది. ఇక కధ లోకి వెళ్ళితే రాజరాజ నరేంద్రుడి సవతి తల్లి కుమారుడు విజయాదిత్యుడు రాజ రాజ నరేంద్రుడికి పక్కలో బల్లం వలే ఉండేవాడు. ఒకరోజు చిత్రాంగి సారంగధారుడిని విందుకు ఆహ్వానించింది. కానీ వేట పై ఆసక్తి ఉన్న సారంగధారుడు విందుకు రాకుండా వేటకు వెళ్తాడు.
ఆ విషయాన్ని చారులు ద్వారా తెలుసుకొన్న విజయాదిత్యుడు చిత్రాంగి - సారంగధారుడికి అక్రమ సంభంధం ఉన్నదని రాజారాజ నరేంద్రుడి చెబుతాడు. విషయా విషయాలు పరిశీలించకుండా రాజరాజ నరేంద్రుడు సారంగధారుడి రెండు చేతులు, రెండు కాళ్ళు ఖండించాలని శిక్ష వేస్తాడు.ఈ ప్యాలెస్ చాలా పురాతనమైనది.మీరు రాజమండ్రి వచ్చినప్పుడు తప్పక సందర్శించివలసిన ఒక ప్రదేశం.