ఒక ప్రత్యేకమైన రాతిని రెండు సమాంతర దారులుగా దాదాపు ముప్పై అడుగుల లోతుకు చెక్కిన ప్రాంతానికి పెట్టిన పేరే రథం దారి గుర్తులు. చాలా మంది ఇది శ్రీ కృష్ణుడి రథం గుర్తులని చెప్తారు. ఈ రథం గుర్తుల చుట్టుపక్కల వున్న రాతి మీద వున్న 1 నుంచి 5 వ శతాబ్దానికి చెందినదని చెప్పబడే రాతి శాసనం ఇప్పటికీ వెలుగులోకి రాకపోవడం ఈ ఊహలకు బలం చేకూరుస్తోంది.