వైభవ పర్వతం అడుగున వున్న వేడినీటి బుగ్గలను బ్రహ్మకుండ్ అని పిలుస్తారు. సప్తదార లేక ఏడు కొలనుల నుంచి ఈ నీళ్ళు వస్తాయి. అన్నిటి కన్నా వేడిగా వుండే బుగ్గలో నీటి ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకు వుంటుంది. మగవారికి, ఆడవారికి వేర్వేరు స్నానపు ఘట్టాలు వున్నాయి. ఈ బుగ్గల్లో నీటికి ఔషధ విలువలు వున్నాయని, ప్రత్యేకంగా చర్మ వ్యాధులను నయం చేస్తాయని అంటారు.