పూర్వం చంపఝార్ అనిపిలువబడే చంపారన్ పట్టణం, రజిం నుండి షుమారు 15 కిలోమీటర్ల దూరం వద్ద ఉంది. చంపారన్ ప్రసిద్ధ వైష్ణవ పీఠం, ఇది వైష్ణవ మత స్థాపకుడైన వల్లభాచార్య సాధువు జన్మస్థలం. ఈ ఆలయ ప్రాంగణ లోపలిభాగం ఈ ప్రాంతంలో ప్రశాంత ఆధ్యాత్మికతను పెంపొందించే పాలరాయితో తయారుచేయబడింది. ఈ ఆలయ వెలుపలి భాగం, రంగురంగుల స్థంభాలు, తోరణాలతో కాంతివంతంగా కళ్ళకు కనువిందు చేస్తుంది. అంతేకాకుండా, చంపారన్ ఆలయం సాధువుల జీవిత కధలను వివరించే విగ్రహాలు గల లోపలి ప్రాంగణం ని కూడా కలిగి ఉంది.
ఈ పట్టణంలో వల్లభాచార్య సాధువు గౌరవార్ధం నిర్మించిన ఒక ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రాంగణాన్ని సుదామపురి అని అంటారు. ఈ ఆలయం హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో ఎక్కువగా గుజరాతీ భక్తులతో నిండి ఉంటుంది.