రాజీవ్ లోచన్ ఆలయం, రజిం పట్టణంలోని ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి. విష్ణుమూర్తికి అంకితం చేసిన విస్తృతంగా చెక్కబడిన ఈ ఆలయం సందర్శకుల కళ్ళకు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఈ మందిరాన్ని సందర్శిస్తారు.
రాజీవ్ లోచన్ ఆలయం ప్రధాన నిర్మాణానికి ఆధారంగా పన్నెండు గట్టి బురుజులను కలిగి ఉంది. ఈ రాతి స్థంభాలు హిందూ పురాణాలకు చెందిన వివిధ దేవతల విగ్రహాలతో అందంగా అలంకరించబడి ఉంటాయి. ఈ ఆలయ ప్రవేశ ద్వారా తలుపు కూడా లతలు, వ్యక్తుల చెక్కుళ్ళను కలిగి ఉంది. రాజీవ్ లోచన్ ఆలయానికి సమీపంలో వామన ఆలయం, నరశింహ ఆలయం, శివుడు, మరియు ఇతర దేవుళ్ళ ఆలయాలు ఉన్నాయి.