రాజనందగావ్1973 జనవరి 26 లో దుర్గ్ జిల్లా నుండి చెక్కబడింది. శాంతిని, సామరస్యాన్ని కేంద్రీకరించే రాజనందగావ్కి మరోపెరైన శంస్కర్దని కి వివిధ మతాలకు చెందిన అనేక మంది ప్రజలతో వర్ధిల్లుతుంది. ఇది చెరువులు, నదులు సరిహద్దులుగా కలిగి ఉండి, కొన్ని చిన్నతరహా పరిశ్రమలు, వ్యాపారానికి ప్రఖ్యాతి గాంచింది. రాజనందగావ్కి దుర్గ్, బస్తర్ తూర్పు, దక్షిణ సరిహద్దులుగా ఉన్నాయి. రాయపూర్ నుండి 73 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి రాబోయే రోజులలో వైమానిక స్థావరానికి ప్రణాళిక చేయబడుతుంది.
నందగ్రం అనే అసలు పేరున్న రాజనందగావ్పురాతన కాలంలో అనేకమంది వంశీయులు పాలించారు. వారిలో కొంతమంది సోమ్వంశీయులు, కల్చురీలు, మరాఠాలు. ఈ ప్రాంతంలోని రాజభవనాలు ఆనతి పాలకులు, వారి సమాజం గురించి మరిన్ని విషయాలు వెల్లడించింది. ఆనతి సంస్కృతి, సంప్రదాయాలు ఈ ప్రాంతం గుండా ప్రతిబింబిస్తాయి.
పాలకులు వైష్ణవ, గోండ్ రాజుల వలె ఎక్కువగా హిందువులు. ఇది కూడా బ్రిటిష్ పాలనలో రాజ్ నంద్గావున్ రాచరిక రాష్ట్ర రాజధానిగా ఉంది. రాచరిక రాష్ట్ర చివరి పాలకుని పేరుపెట్టబడిన కళాశాల ప్రారంభానికి ఈ రాజభవనం ఇవ్వబడింది.
ఈ ప్రాంతంలో నివశించేవారికి హిందీ, చట్టిస్గారి ప్రధాన భాషలు. రాజనందగావ్అనేక విద్య సంస్థలకు నిలయం. ఎంతో ఉత్సాహంతో, భక్తితో జరుపుకునే దీవాలి, గణేష్ చతుర్థి ఈ ప్రాంతంలోని ప్రధాన పండుగలు. ఈ పండుగల సమయంలో “మొహర మేళా”, “ఎడ్ల పందాలు”, మినా బజార్ వంటివి నిర్వహించబడతాయి.
రాజనందగావ్లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు
రాజనందగావ్లోని ఆలయాలు సందర్శనకు విలువైనవి, నాతిలో కొన్ని గాయత్రీ మందిరం, సిత్ల మందిరం, బర్ఫానీ ఆశ్రమం. దొంగార్గడ్ పర్యాటక ఆకర్షణ కేంద్రం. బంలేశ్వరి మాత ఆలయం కొండపై నిక్కబొడుచుకొని ఉన్న దొంగార్గడ్ వద్ద ఉంది. దీనిని బడి బంలేశ్వరి అని కూడా అంటారు.
చోటి బంలేశ్వరి
ఈ ఆలయం నేలపై ఉంది. దసరా, రామనవమి సమయంలో రాష్ట్రంలోని ప్రజలందరూ ఈ ప్రాంతంలో గుంపులుగా కనిపిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో మేళాలు నిర్వహించబడతాయి. మాత శీతల దేవి శక్తి పీఠం మరో తీర్ధయాత్రా స్థలం. ఇది 2200 సంవత్సరాల కిందటి పురాతన ఆలయం. ఇది స్టేషన్ నుండి 1.5 కిలోమీటర్ల దూరం వద్ద ఎత్తైన ప్రదేశంలో ఉంది.
రాజనందగావ్చేరుకోవడ౦ ఎలా
విమానం ద్వారా తక్కువ అనుసంధానం కలిగి ఉన్న వివిధ నగరాలతో రాజనందగావ్ని రైలు, రోడ్డు మార్గాలు కలుపుతాయి. ఇది ప్రధాన రైలు, రహదారి జంక్షన్.