బంలేశ్వరి మాత ఆలయానికి పేరుగాంచిన దొంగార్గడ్, కేవలం ప్రధాన పర్యాటక ఆకర్షణ మాత్రమే కాక ఒక ధార్మిక స్థలం కూడా, కానీ ఇది దాని అద్భుతమైన అందానికి కూడా చెప్పుకోదగ్గది. ఇది రాజనందగావ్నుండి 35 కిలోమీటర్లు, దుర్గ్ నుండి 67 కిలోమీటర్లు, రాయపూర్ నుండి 107 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్వతాలు, కొలనులు దొంగార్గడ్ అందాన్ని పెంపొందిస్తాయి.
బంలేశ్వరి దేవి మాత ఆలయం 1600 అడుగుల ఎత్తువద్ద కొండపై ఉంది. ఈ ఆలయంలోని విగ్రహం ఆధ్యాత్మిక ప్రాధాన్యతో తయారుచేయబడిందని పురాణాలు చెప్తాయి. చోటి బంలేశ్వరి అనే మరో ఆలయం దీనికి సమీపంలో ఉంది. భక్తులు నవరాత్రి సమయంలో ఇక్కడ గుంపులుగా కనిపిస్తారు. దీనికి దగ్గరగా శివాలయం, హనుమంతుని ఆలయాలు కూడా ఉన్నాయి. నవరాత్రి సమయంలో జ్యోతి కలశ అనేది సాంప్రదాయ దీపం.
ఈ ఆలయాలే కాకుండా దొంగార్గడ్ లో రోప్ వే కూడా మరో ఆకర్షణ. ఇది ఛత్తీస్గడ్ లోని ప్రయాణీకులకు ఏకైక రోప్ వే. జైన ఆలయం ప్రణాళిక చేయబడిన చంద్రగిరి ఒక కొండ. తీర్ధంకర దేవుడు చంద్రప్రభుజి పురాతన విగ్రహం ఇక్కడ ఉంది.
124 కిలోమీటర్ల దూరం వద్ద ఉన్న రాయ్పూర్ దీనికి సమీప విమానాశ్రయ౦. దొంగార్గడ్ సమీప రైల్వే స్టేషన్. రోడ్డుమార్గం ఉత్తమ రవాణా సౌకర్యంగా ఏర్పడడం వల్ల దొంగార్గడ్ అంతటా బస్సులు, ప్రైవేట్ టాక్సీలు నడుస్తాయి. కలకత్తా-ముంబై జాతీయ రహదారి లేదా NH6 పచ్చదనం, తేలికపాటి అడవుల మార్గాల గుండా వెళతాయి. పర్యాటకులు ఏడాది పొడవునా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.