రాజౌరి జిల్లా జమ్ము & కాశ్మీర్ లో ప్రసిద్ధి చెందిన దర్శనీయ ప్రదేశాలలో ఒకటి. ఈ జిల్లా ప్రారంభంలో పూంచ్ జిల్లాలో కలిసి ఉండేది. 1968లో రాజౌరి ఒక స్వతంత్ర జిల్లా ప్రకటించారు. జరాల్ రాజవంశం 1194 నుంచి 1846 AD వరకు రాజౌరి జిల్లాలో పరిపాలన చేసింది. రాజౌరి లో ఉన్న కోటలు మరియు మసీదులు జరాల్ రాజవంశం యొక్క పాలనలోనే నిర్మించబడ్డాయి మరియు ఆకాలం నాటి నిర్మాణ శైలి కనిపిస్తుంది.
సందర్శకులకు అనేక ఆకర్షణలు ఉంటాయి. వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన పంజ పీర్ మరియు లాల్ బౌలి ఉన్నాయి.యాత్రికులు రాజౌరి జిల్లాలో పర్యటనకు ప్రణాళికను సిద్దం చేసుకోవచ్చు.పంజాబ్ నుండి వచ్చిన ఐదుగురు సాధువులు మరియు వారి సోదరి యొక్క శ్మశానవాటికలకు ప్రసిద్ధిగాంచిన పంజ పీర్ మందిరంను సందర్శించాలి.ఈ ప్రదేశమును పార్లమెంటరీ మరియు ఆర్మీ సిబ్బంది మరియు అసంఖ్యాకంగా భక్తులు సందర్శిస్తారు. లాల్ బౌలి ఒక నీటి సరస్సు.ఇది రాజౌరి జిల్లా యొక్క మరొక ప్రఖ్యాత ఆకర్షణ. వివిధ రకాల చేపల జాతులు ఈ ప్రదేశం వద్ద పర్యాటకులు చూడవచ్చు.
ఈ జిల్లా కతోరి సార్, మాదిగ సార్, దియా సార్, సమొత్ సార్, గమ్ సార్, భాగ్ సార్, మరియు అకల్ దర్శిని అనే కొన్ని సరస్సులకు పేరు గాంచింది.తన్నమంది సారాయ్, మంగళాదేవి కోట, మురద్పూర్ సారాయ్ మరియు మసీదు, నడ్పూర్ సారాయ్ మరియు నోగాజి జియారత్ మొదలైనవి రాజౌరిలో ప్రముఖ ఆకర్షణలుగా ఉన్నాయి.ఉస్మాన్ మెమోరియల్ మరియు ఆత్మా త్యాగం భవన్,పాకిస్తాన్ దళాలు నుండి ఈ ప్రాంతాన్ని రక్షించడానికి తమ జీవితాలను త్యాగం చేసిన పౌరుల జ్ఞాపకార్థంగా స్థాపించబడిన గమ్యానికి చెందిన ప్రధాన ఆనవాళ్లు ఉన్నాయి.
యాత్రికులు విమాన మార్గం ద్వారా ,రైలు ద్వారా,రహదారుల ద్వారా చేరవచ్చు.రాజౌరి జిల్లాను సందర్శించడానికి ఉత్తమ సమయం ఏప్రిల్ నుండి మొదలై జూన్ వరకు కొనసాగుతుంది. వేసవి కాలం మరియు శీతాకాలం సందర్శనా కోసం అనుకూలముగా ఉంటుంది. అయితే, పర్యాటకులు శీతాకాలంలో రాజౌరి జిల్లా సందర్శనకు ప్లాన్ చేసుకోవచ్చు.