ఆడం బ్రిజ్ ను రామ సేతు లేదా రాముడి బ్రిజ్ అని కూడా అంటారు. దీనిని వానరులు రాముడు లంకను చేరి సీతను రావణుడి బారినుండి రక్షించేందుకు నిర్మించారు. రామాయణంలో ఈ బ్రిజ్ ను సేతుబంధనంగా అభివర్ణించారు.
వాస్తవానికి ఈ బ్రిజ్ సున్నపు రాయి తో పంబన్ ద్వీపం మరియు శ్రీ లంకల మధ్య అంటే తమిళ్ నాడు ఈశాన్య కోస్తా తీరం మరియు శ్రీ లంక వాయువ్యం ల మధ్య నిర్మించబడింది. ఈ సేతువు గతం లో భారత దేశానికి, శ్రీ లంకకు కాలి మార్గం గా ఉండేదని భౌగోళిక శాస్త్ర వేత్తలు ధ్రువపరిచారు. ఇపుడు ఈ రెండు దేశాల ను వేరు చేసే సముద్రం ను సేతు సముద్రం లేదా వంతెన సముద్రం గా పేర్కొన్నారు. ఈ బ్రిజ్ గురించి క్రైస్తవ పురాణాలలో కూడా కాలదు. ఆదం ఈ బ్రిజ్ దాటి అక్కడ కల పర్వతానికి వెళ్లి అక్కడ వేయి సంవత్సరాల పాటు ఒంటి కాలిపై తపస్సు చేసాడని చెపుతారు. అందుకనే దీనిని ఆదం బ్రిజ్ అని పిలుస్తారు.