అగ్ని తీర్థం శ్రీ రామనాథ స్వామి టెంపుల్ వెలుపల సముద్రానికి ఒక పక్కగా వుంటుంది. పురాణాల మేరకు రాముడు రావణుడిని, ఇతర రాక్షసులను వధించిన తర్వాత ఈ సముద్ర భాగంలో స్నానం చేసాడని చెపుతారు. ఇక్కడ స్నానం చేసి ఒక బ్రాహ్మణుడిని వధించిన పాపం పోగొట్టుకునేందుకు శివుడిని ధ్యానిన్చాడని చెపుతారు. అందుకనే నేటికి పాపాలు పోవాలని పవిత్ర నదులలో స్నానాలు చేస్తారు.
అగ్ని తీర్థంలో స్నానం చేసిన తర్వాతే అసలైన రామేశ్వరం యాత్ర మొదలవుతుందని చెపుతారు. అయితే ప్రస్తుతం ఈ తీర్థంలోని నీరు పరి శుభ్రంగా లేదని ఫిర్యాదులు వస్తున్నాయి.
దీని మతపర ప్రత్యేకత కారణంగా ఈ కొలను నీటి పట్ల జాగ్రత వహించాలని పర్యాటక యాత్రికులు కోరుతున్నారు .