కురుసడాయి ద్వీపం లో అంతరించిపోతున్న అనేక సముద్ర జీవులు కలవు. ఈ దీవి సందర్శించే వారు సాధారణంగా సముద్ర లేదా నీటి నిపుణులు , పరిశోధన చేసేవారుగా వుంటారు. ఇక్కడ అధికంగా పగడపు ఆల్చిప్పలు కనపడతాయి. ఈ ద్వీపం మండపం నుండి 7 కి. మీ. ల దూరం వుంటుంది. గల్ఫ్ అఫ్ మన్నార్ లో డాల్ఫిన్ లు, సి కౌ లు కూడా చూడవచ్చు. అరుదైన ప్రాచిన సముద్రపు ప్రాణులు కూడా కనపడతాయి. ఇక్కడి కొన్ని ప్రాంతాలు చూసేందుకు అధికారుల ముందస్తు అనుమతులు కావాలి.