రామేశ్వరం లోని సాక్షి టెంపుల్ శ్రీ రామనాథ స్వామి టెంపుల్ కు 3 కి.మీ.ల దూరంలో గంధమాదన పర్వతం వెళ్ళే మార్గం లో వుంటుంది. ఒక పురాణ గాధ మేరకు హనుమంతుడు ఈ ప్రదేశం లో తాను సీతను కనుగోనినట్లు రాముడికి చెపుతాడు. దానికి తాను తెచ్చిన సీత యొక్క చూడా మణి లేదా ఆభరణం సాక్షి అని చెపటం తో దీనిని సాక్షి టెంపుల్ అంటారు. శ్రీరాముడు ఆనందంతో హనుమంతుడిని కౌగలించుకొని అతనిని తన నిజమైన భక్తుడిగా తెలుపుతాడు.
ప్రతి సంవత్సరం ఈ టెంపుల్ ను గంధమాదన పర్వతం వెళ్ళే సమయంలో రాముడి మరియు ఆంజనేయుడి భక్తులు దర్శిస్తారు. ఈ టెంపుల్ హనుమాన్ కు ఇష్టమైన మంగళ వారాలలో అధిక జనంతో నిండి వుంటుంది.