రాజ్రప్ప వద్ద ఉన్న ఈ ఆలయం మా చిన్మస్తిక ఆలయానికి పేరుగాంచింది, ఇది రాంగడ్ కంటోన్మెంట్ నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రసిద్ది చెందిన ఈ ప్రదేశం హిందువులకు యాత్రాస్థలంగా ఉంది, ఈ ఆలయం ‘శక్తి పీఠం’ గా కూడా పిలువబడుతుంది. పురాతన నిర్మాణ శైలి కలిగిన మా చినమస్తిక ఆలయం తాంత్రిక ప్రాధాన్యత కలిగిఉంది. తమర పువ్వుపై కామ్దేవ్, రాతి విగ్రహలపై చినమస్తిక దేవత తలలేని విగ్రహం ఉండడం ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయం, శివుడు, శక్తి మాత పవిత్ర కలయికగా భావించబడే భారవి, దామోదర్ నదుల సంగమానికి సమీపంలో ఉంది. ఈ ఆలయం వద్ద అనేక కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు జరుగుతాయి.