ద్వారాహత్ చారిత్రిక, పురాతత్వ సంబంధిత ముఖ్య పర్యాటక ఆకర్షణ. రాణిఖేత్ నుండి 35 కి.మీ.ల ప్రయాణ దూరంలో ఉన్న ఈ స్థలంలో 55 పురాతన ఆలయాలు ఉన్నాయి. శక్తి ఆలయం, నైత్న దేవి ఆలయం, బద్రీనాథ్ ఆలయం, మనియన్ ఆలయం, మృత్యుంజయ ఆలయం మరియు ధ్వజ్ ఆలయం అందులో కొన్ని. ఒక నమ్మకం ప్రకారం, సంజీవని అనే అరుదైన మూలిక శక్తి దేవాలయ ప్రాంగణము లోపల పెరుగుతుంది.
రాంగంగ నది యొక్క సుందరమైన లోయ లో ఉన్న ద్వారాహత్ సందర్శకులకు విస్తృత దృశ్యాలు అందిస్తుంది. ఈ స్థలం పూర్వం కత్యూరి రాజ్యం యొక్క రాజధానిగా ఉంది . ఇది 16 వ శతాబ్దంలో కత్యూరి రాజ పాలకుల శక్తి కేంద్రంగా కూడా సేవలు అందించింది. ఏప్రిల్ నెలలో ఇక్కడ నిర్వహించే వార్షిక స్యాల్దే-బిఖుతి పండుగ దీని ఆకర్షణను మరింత పెంచుతుంది. ఈ స్థలం యొక్క ఇతర ముఖ్యమైన పండుగలలో మకర సంక్రాంతి, వసంత పంచమి, ఒల్గియా, ఖతారువా, బాట్ సావిత్రి మరియు గంగా దసరా ఉంటాయి.