జోగి మహల్, రణధంబోర్ కలొండ దిగువ భాగంలో ఉంటుంది. దీనిని జైపూర్ రాజ కుటుంబాలు నిర్మించారు. చాలా తరాలు దీనిని వారి వేటల విడిదిగా వాడుకునేవి. ఈ అటవీ గెస్ట్ హౌస్ పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కలిగిస్తుంది. జోగి మహల్ నుండి పదం తలావ్ సరస్సు చూడవచ్చు. ఇక్కడే ఒక అతి పెద్ద రావి చెట్టు కూడా ఉంది. ఇది. ఇండియాలోనే రెండవ అతి పెద్ద రావి చెట్టుగా చెపుతారు. సాహస చర్యలు చేయాలనుకునే పర్యాటకులు ఇక్కడనుండి లహపురాండ్, నల్ ఘాటి మరియు బకౌలా అనంతపూర్ లకు ట్రెక్కింగ్ లు చేయవచ్చు.