ఉత్తర భారత దేశంలో రణధంబోర్ నేషనల్ పార్క్ అతి పెద్ద అటవీ రిజర్వులు కలిగి ఉంది. ఒకప్పుడు ఈ అడవులలో రాజుల వేటలు సాగేవి. 1955 లో ఇది వన్య అభయారణ్యంగా స్ధాపించారు. 1980 సంవత్సరంలో ఱణధంబోర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కి నేషనల్ పార్క్ హోదా కలిగించారు. ఇక్కడ పులులే కాక వివిధ రకాల ఇతర జంతువులు, నక్కలు, హయనాలు, మొసల్ళు, అడవి పందులు వివిధ రకాల జింకలు కూడా నివాసం చేస్తాయి. మొక్క జాతులు అనేకం కలవు. ఈ అటవీ రిజర్వు ప్రాంతం సుమారు 392 చ. కి.మీ.లలో కలదు. టైగర్ రిజర్వుగా ఈ ప్రదేశం దేశంలోని అన్నిటికంటే కూడా ఒక జాతీయ పార్కుగా ప్రసిద్ధి చెందింది. అటవీ శాఖ నిర్వహిస్తున్న ఈ పార్కులో నుండి బయటకు వెళ్ళేందుకు పర్యాటకులు స్వేచ్చగా సంచరించవచ్చు. ఫొటో గ్రఫీ మరియు వీడియోగ్రఫీ లకు కూడా ఏర్పాట్లు చేయబడ్డాయి.