రేవారీ, హర్యానా రేవారీ జిల్లాలోని ఒక పట్టణం. ఇది ఢిల్లీ నుండి షుమారు 89 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది జాతీయ రాజధాని ప్రాంతంలో ఒక భాగం. భారతదేశ చివరి హిందూ చక్రవర్తి హేము ఇక్కడే చదువుకుని, ఇక్కడే పెరిగాడని చరిత్ర ఉంది. తన హవేలీ ఇప్పటికీ ఈ నగర కుతబ్పూర్ ప్రాంతంలో ఉంది. ఆయన సమయంలో, చక్రవర్తి రాగి పలకలు, పాత్రలు, ఇత్తడి తయారీలో లోహ పరిశ్రమకు శంకుస్థాపన చేసాడు. ఇప్పటికీ ఈ ఉత్పత్తులు ప్రసిద్ది చెందాయి. రేవారీ, హర్యానా గుర్గావ్ జిల్లలో భాగంగా ఉంది. ఇది తరువాత మహెన్ద్రగర్హ లో ఒక భాగమై, స్వతంత్ర జిల్లా అయినప్పటి నుండి, 1989 వరకు కొనసాగింది.
రేవారి లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు రేవారీ లో ప్రధాన ఆకర్షణ రేవారీ హెరిటేజ్ స్టీం లోకోమోటివ్ మ్యూజియం. ఈ మ్యూజియం షెడ్ గృహాన్ని 1893 లో నిర్మించారు, ఇది కఠినమైన ప్రయాణాల కోసం మనుగడలోని కొన్ని ఆవిరి యంత్రాలు ఉన్న భారతదేశంలోని ఏకైక ప్రదేశం. ఈ ఆవిరి యంత్రాలు నిర్లక్ష్య స్థితిలో ఉండడం వల్ల 1990 లో వీటిని క్రియాశీల సేవలనుండి తొలగించారు. అయితే ఈ షెడ్ ని 2002 డిసెంబర్ లో ఆవిరి యంత్రాల కోసం ఒక హెరిటేజ్ మ్యూజియంగా రైల్వే యంత్రాంగం తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
రేవారీ వాతావరణం రేవారీ పొడి, శుష్క వాతావరణాన్ని కలిగిఉంటుంది. ఇది వేసవి, శీతాకాలం, వర్షాకాలం మూడు కాలాలను అందిస్తుంది.
రేవారీ చేరుకోవడం ఎలా రేవారీ వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. ఇక్కడ ప్రధాన రైల్వే జంక్షన్ కూడా ఉంది.