నాంగ్పో లో ప్రధాన కేంద్రంగా గల రీ భోయి మేఘాలయలోని 11 జిల్లాల్లో ఒకటి. సౌథ్ గారో హిల్స్ జిల్లా తరువాత మేఘాలయలో అతి తక్కువ జనాభా కల జిల్లా రీ భోయి. ఈ జిల్లాను తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా నుంచి వేరు చేసారు.
రీ భోయి పరిసరాల్లో పర్యాటక ప్రదేశాలు
రీ భోయి పర్యాటకంలో అన్నిటి కన్నా ప్రధాన ఆకర్షణ – బారా పానీ గా పిలువబడే ఉమియం సరస్సు. మానవ నిర్మితమైన ఈ సరస్సు ఒక ప్రధాన జలవిద్యుత్ ఆనకట్ట. ఈ సరస్సు ఇక్కడి క్రీడా సౌకర్యాలకు కూడా ప్రసిద్ది. పర్యాటకులు ఇక్కడ కయాకింగ్, వాటర్ సైక్లింగ్, బోటింగ్ లను ఆస్వాదించవచ్చు. విహార యాత్రలకు వెళ్ళడానికి లామ్ నెహ్రూ పార్కు బాగా ప్రసిద్ది. లం సోపెట్నేంగ్, డైన్గై శికారం, ద్వార్క్ సూద్ ఇక్కడి ఇతర పర్యాటక ఆకర్షణలు.
రీ భోయి సందర్శనకు ఉత్తమ సమయం
వాతావరణం పొడిగా వుండి ప్రయాణానికి అనుకూలంగా వుండే వేసవి లో రీ భోయి సందర్శించడం మంచిది.
రీ భోయి ఎలా చేరుకోవాలి
రీ భోయి జిల్లా కేంద్రం నాంగ్పో షిల్లాంగ్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో వుంది. గువహతి – షిల్లాంగ్ రహదారి లో మధ్యలో వుంది ఈ వూరు. 40 వ నెంబర్ జాతీయ రహదారి రీ భోయి జిల్లాలోని చాలా భాగం గుండా వెళ్తుంది. గువహతి నుంచి ప్రైవేటు టూరిస్ట్ వాహనాలు, బస్సుల్లో నాంగ్పో కు పర్యాటకులు తేలిగ్గానే చేరుకోవచ్చు.