ఓంకారానంద ఆశ్రమం 1967 లో స్థాపించబడింది మరియు ముని-కె -రెటీ సమీపంలో ఉంది. పవిత్ర గంగా నది ఒడ్డున,మరియు లక్ష్మణ్ జూలా మరియు శివానంద నగర్ దగ్గరగా ఉంది. ఇది ఒక ప్రసిద్ధ హిందూ మత మహర్షి తత్వవేత్త మరియు రచయిత అయిన H.D. పరమహంస ఓంకారానంద సరస్వతి నిర్మించారు. భక్తులు ఓంకారానంద అన్ని ఆశ్రమములు, దేవాలయాలలో ప్రార్థనలు మరియు భజనలు చేస్తారు.
అంతే కాకుండా ఆధ్యాత్మికం కార్యకలాపాలు, ధ్యానం తరగతులు మరియు యజ్ఞాలను ఆశ్రమంలో నిర్వహిస్తారు. ఈ ఆశ్రమం ఓంకారానంద ధర్మ సంస్థాన్,ఓంకారానంద ఛారిటబుల్ ట్రస్ట్ మరియు ఓంకారానంద ఎడ్యుకేషనల్ సొసైటీ వంటి ట్రస్ట్ లను నడుపుతుంది. ఈ ఆశ్రమం, సామాజిక ఆధ్యాత్మికం, సాంస్కృతిక, మరియు విద్యా రంగాల్లో పనిచేస్తుంది. ప్రజలు ఆశ్రమం యొక్క ప్రాంగణంలో ఉన్న పాఠశాల లో శాస్త్రీయ సంగీతం మరియు నృత్యం నేర్చుకోవచ్చు.