రోహ్రు లోని గిరిగంగా టెంపుల్ గిరిగంగా నది ఒడ్డున కలదు. ఒక ఇతిహాసం మేరకు ఈ టెంపుల్ ను మహాభారతాన్ని రచించిన మహర్షి వేద వ్యాసుడు సుమారు 5500 సంవత్సరాల కిందట నిర్మించారని చెపుతారు. ఈ టెంపుల్ దట్టమైన అడవుల మధ్యలో చలికాలంలో పూర్తి మంచుతో దట్టంగా కప్పబడి ఆకర్షణీయంగా వుంటుంది. సాహస సందర్శకులు ఇక్కడ కల దట్టమైన దేవదారు అడవుల మధ్య కల హైకింగ్ మార్గాలను అన్వేషించవచ్చు.