హత్కోటి లో హత్కేశ్వరి మాత టెంపుల్ ప్రసిద్ధి. ఈ టెంపుల్ 6 వ మరియు 9వ శతాబ్దాల నాటి శిల్ప శైలి ని కలిగి వుంది. దీనిలో దుర్గా దేవి అవతారమైన మహిషాసుర మర్దిని రాగి లోహ విగ్రహం వుంటుంది. ఈ విగ్రహంలో ఎనిమిది చేతులు మరియు ఒక సింహం పై మాత వున్నట్లు అందంగా మలచారు. ఒక చేతితో ఆమె మహిషాసుర మర్దినిగా రాక్షసుడిని గుంటల పై బల్లెం తో పొడుస్తూ వుంటుంది.
అశ్విని నవరాత్రి, చైత్ర నవరాత్రి పండుగలు ఈ టెంపుల్ లో వైభవంగా జరుపుతారు. ఆ సమయంలో వేలాది భక్తులు దూర ప్రాంతాల నుండి వస్తారు. గుడిలోని దేవతను పూవులతో పూజిస్తారు. హల్వా, వాల్ నట్స్ , అన్నం వంటివి మరియు ఒక మేక లేదా గొర్రె ను దేవతకు బలి ఇచ్చి దాని మాంసం నైవేద్యం పెట్టి ప్రసాదంగా తింటారు.
కాంప్లెక్స్ ముందు భాగంలో మరొక శివుడి గుడి కూడా కలదు. ఒక ధర్మశాల, రెస్ట్ హౌస్ గ్రానరీస్ కూడా టెంపుల్ కాంప్లెక్స్ లోపల కలవు. టెంపుల్ లో గోపురం వంటి శిఖరాలు మొదట ఉండేవి. అయితే తర్వాత 19వ శతాబ్దంలో నేడు కనపడే కొయ్య పగోడాలు నిర్మించారు.