అస్తాల్ బోహర్ అనేది గోరఖ్ నాథ్ శాఖకు చెందిన అనుచరుల మఠం లేదా ఒక ధార్మిక నివాస ప్రాంతం. ఈ శాఖను అనుసరించే వారు పరమశివుని ప్రగాఢ భక్తులు. రోహటక్-ఢిల్లీ జాతీయ రహదారి నంబరు 10 పై రోహటక్ ప్రధాన నగరానికి తూర్పున సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఈ మఠం ఉంది.
జానపదుల ప్రకారం ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న సియాల్ కోట నివాసి, గురు గోరఖనాథ్ శిష్యుడు పూరన్ భగత్, ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. అతనికి ఈ ప్రాంతం నచ్చి, తన శిష్యులు ధ్యానం చేసుకోవడానికి, సంప్రదాయం ప్రకారం ఆచారాలను నిర్వహించడానికి కోసం ఒక మఠాన్ని నిర్మించాడు.
ఈ మఠంలో అవశేషాలు, పురాతన ఆవిష్కరణలు, చెక్కిన రాతి శిల్పాలు, పవిత్ర గ్రంథాలు, పుస్తకాలు, ధార్మిక ప్రాధాన్యత ఉన్న అనేక ఇతర వస్తువులు ఉన్నాయి. నాథ్ శాఖ వారు ప్రత్యేకంగా కాన్ఫడ యోగులు – చెవులు కుట్టించుకొనే సన్యాసులు దీనిని పవిత్రమైన, ఎంతో గౌరవమైన మఠాలలో ఒకటిగా పరిగణిస్తారు.