సాసా రాం దేహ్రి కి పడమటి భాగాన 17 కి. మీ. ల దూరం లో వుంది. ఇక్కడ ఇండియా లో రెండవ ఎత్తైన షేర్ షా సూరి టూంబ్ కలదు. మొగల పాలనలో ఈ టూంబ్ ఎంతో వైభవంగా కట్టబడింది. దీని శిల్ప నిర్మాణం అంతా పఠాన్ శైలి లో సాగింది. దీనిని రాతితో నిర్మాంచారు. టూంబ్ లోపలి భాగం, మంచి గాలి వెలుతురు వచ్చేదిగా కిటికీలతో కూడా వుంటుంది.
మిహరాబ్ ఆర్చ్ మరింత అందంగా వుంటుంది. దీని గోడలపై అనేక లిఖితాలు వుంటాయి. గోడల టైల్స్ నేటికి ఆకర్షణీయంగా పూలతో చెక్కబడి వుంటాయి. దీనిని ఒక పెద్ద చెరువు మధ్యలో నిర్మించారు. షేర్ షా సూరి టూంబ్ ని ప్రపంచంలో మూడవ వింతగా ప్రకటించారు. ఇండియాలోని ఏడు వింతలలో ఒకటిగా నియామకం చేయబడింది. సాసారాం లో మాత తారాచండి టెంపుల్ అధిక ప్రాధాన్యత కలిగినది. భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. టవున్ లో ఇంకా అనేక స్మారకాలు కలవు.