రుద్రనాథ్ లోని రుద్రనాథ్ టెంపుల్ సముద్ర మట్టానికి 2286 మీ.ల ఎత్తున కలదు. టెంపుల్ లో హిందువుల దేముడు అయిన శివుడు పూజలు అందుకుంటూ ఉంటాడు. టెంపుల్ లో శివ భగవానుడిని నీలకంట మహాదేవుడు గా కొలుస్తారు. పురాణాలమేరకు పాండవులు యుద్ధం ముగిసిన తర్వాత తమ పాపాలను క్షమించమని శివ భగవానుడిని వేడుకుంటూ హిమాలయాలకు వస్తారు.
అయితే,శివుడు వారిని కలువ దలుచుకో లేదు. వెంటనే ఒక నంది గా మారి అక్కడనుండి తప్పించుకుంటాడు. పాండవులు ఆ నందిని గుప్తకాశి లో చూస్తారు. కాని దానిని పట్టుకో లేక పోతారు.ఆ తర్వాత శివుడి శరీరభాగాలు గర్హ్వాల్ ప్రాంతంలో అయిదు చోట్ల పంచ కేదార్ లు గా వెలుస్తాయి. శివుడి ముఖం పడిన ప్రదేశం లో రుద్రనాథ్ టెంపుల్ నిర్మిస్తారు.
టూరిస్టులు ఈ టెంపుల్ ను సాగర్ గ్రామం మరియు జోషిమట్ ల నుండి ట్రెక్కింగ్ లో చేరవచ్చు. జోషిమట్ నుండి 45 కి.మీ.ల దూరంవుంటుంది. టెంపుల్ నుండి హతి పర్వత,నంద దేవి, నంద ఘుంటి , త్రిశూల్ లకు గల మార్గంలో టూరిస్టులు రమణీయ దృశ్యాలు చూడవచ్చు. పవిత్ర కొలనులు అంటే సూర్య కుండ్, చంద్ర కుండ్, తరకుండ్, మరియు మన కుండ్ లు టెంపుల్ సమీపం లోకలవు.