రుద్రా ప్రయగ్ తావుకు ఈ ప్రదేశం 38 కి.మీ.ల దూరంలో కలదు. ఇక్కడ కార్తికేయుడు కొలువై ఉంటాడు. ఇది సముద్ర మట్టానికి 3048 మీ.ల ఎత్తున కలదు. చుట్టూ హిమాలయ పర్వతాలు వుంటాయి. ఒక కధ మేరకు శివుడు తన ఇద్దరు కుమారులైన గనేశుడిని మరియు కార్తికేయుడను విశ్వం చుట్టి రావాలని, మొదటగా వచ్చిన వారికి తల్లి తండ్రులను పూజించే అవకాశం ఉంటుందని చెపుతాడు.
గణేశుడు ఉపాయంగా తల్లి తండ్రుల చుట్టూ మూడు మార్లు తిరిగి విశ్వం అంతా మీరేనని, తిరిగి వచ్చాని చెపుతాడు. ఈ చర్య కార్తికేయుడికి కోపం తెప్పిస్తుంది. ఫలితంగా వెంటనే తన ఎముకలు తండ్రికి, తన మాంసాన్ని తల్లికి ఇస్తాడు. ఇప్పటికి ఎముకలు ఈ టెంపుల్ లో కలవు. భక్తులు వీటిని పూజిస్తారు. రుద్రప్రయాగ్ - పోఖ్రి మార్గం లో కల ఈ టెంపుల్ ను కనక చౌరీ గ్రామం నుండి 3 కి.మీ.ల ట్రెక్కింగ్ లో చేరవచ్చు.