మద మహేశ్వర్ టెంపుల్ మద మహేశ్వర్ నది సమీపంలో కలదు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3289 మీ.ల ఎత్తున కలదు. దీనిని రెండవ కేదార్ నాథ్ అంటారు. పురాణాల మేరకు శివుడు పాండవులకు కనపడకుండా దాక్కున్నపుడు ఆయన శరీరం ఈ ప్రదేశంలో అంటే మదమహేశ్వర్ లో ప్రత్యక్షం అయ్యింది. ఈ టెంపుల్ ను వింటర్ లో ఆరు నెలలు చలి కారణంగా మూసి వేస్తారు. ఈ సమయంలో ఇక్కడ కల వెండి విగ్రహాలు ఉఖి మట్ లో పెడతారు. ఈ ప్రదేశ సమీపంలోని ఇతర ఆకర్షణలు అయిన కాళి టెంపుల్, కేదార్నాథ్, సరస్వతి కుండ్, మరియు చౌఖంబా నీల్కంట్ శిఖరాలు కూడా తప్పక చూడదగినవి.