రుఖల, హిమాచల్ ప్రదేశ్ లోని కోట్ ఖై బెల్ట్ మధ్యలో, వేగంగా ప్రాముఖ్య౦ పెరుగుతున్న ఒక పర్యాటక గమ్యస్థానం. ఈ ప్రాంతం సుందరమైన దృశ్యాలు, రుచికరమైన ఆపిల్స్ కి, ఆతిధ్యానికి ప్రసిద్ది చెందింది. ఈ ప్రాంతంలోని ఇతర ఆకర్షణలు వారసత్వ గ్రామాలుగా మార్చబడిన గ్రామాలు.
డిసెంబర్, జనవరి నెలలలో ఆపిల్, రేగు పళ్ళ తోటలు గులాబీ, పచ్చ పళ్ళతో నిండి ఫాం హౌస్ లతో నిండిన పల్లె భూభాగాలతో వర్ణ రంజితమౌతుంది. రుఖల ప్రపంచవ్యాప్తంగా రాయల్, గోల్డెన్, గ్రాన్నీ స్మిత్ ఆపిళ్ళ ఉత్పత్తికి, ఎగుమతి కి ప్రసిద్ది చెందింది.
పచ్చటి తోటలతో బాటు, రుఖలలో ఎన్నో పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. కియరి దేవాలయం, దియోరి దేవాలయం, రుఖలలో అటువంటి చెప్పుకోదగిన అనేక ఆకర్షణలలో కొన్ని. ఈ రెండు దేవాలయాలను పచ్చటి అటవీ సంపద, గ్రామీణ ఫాం హౌస్ ల మధ్యనుండి కొండలపై నడచి చేరవచ్చు. కియరి దేవాలయం, సృజనాత్మక స్త్రీశక్తి స్వరూపిణి దుర్గ దేవికి చెందిన 300 ఏళ్ళ నాటి కట్టడం.
రుఖల నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చంబి-కుప్పర్ ప్రాంతానికి పర్యాటకులు విహారయాత్రలు కూడా చేయవచ్చు.
రుఖల, విమాన, రైలు, రోడ్డు వంటి అన్ని ప్రధాన రవాణా మార్గాల చక్కటి అనుసంధానాన్ని కల్గి ఉంది. వేసవి, వర్షాకాలం, శీతాకాలం రుఖలలో ప్రధాన కాలాలు. ఈ ప్రా౦తం చుట్టపక్కల చూడదలచిన పర్యాటకులు ఈ ప్రాంతాన్ని మేలో మొదలై జూలై వరకు ఉండే వేసవిలో సందర్శించవచ్చు. అయితే, శీతాకాలంలో వాతావరణం ఆహ్లాదకర౦గా ఉండటం వలన ఈ కాలంలో పర్యటన కూడా సిఫార్సు చేయబడింది.