కిరాత్పూర్ సాహిబ్ గత వైభవానికి పవిత్ర గురుద్వారాలకు ప్రసిద్ధి. గురుద్వారా పటాల్ పూరి ఇక్కడ ప్రసిద్ధి. సిక్కులు ఇక్కడ అస్థికలు నిమజ్జనం చేస్తారు. ఆరవ సిక్కు గురు హర గోవింద్ సాహిబ్ జి ఈ ప్రదేశాన్ని 1627 లో స్థాపించాడు. ఇది గురు హర రాయి మరియు గురు హర కృష్ణన్ ల జన్మ స్థలం. ఢిల్లీ లోని మొగల చక్రవర్తి తొమ్మిదవ సిక్కు గురు శ్రీ తెఘ్ బహదూర్ తల నరికిన తర్వాత ఆ తలను ఇక్కడకు తెచ్చారు.
ఈ ప్రదేశం లో గురుద్వారా బాబన్ ఘర్ సాహిబ్ నిర్మించారు. 800 సంవత్సరాల సుదీర్ఘ కాలం బతికిన పీర్ బుద్దాన్ షా అనే ముస్లిం ప్రవక్త కూడా ఇక్కడి వాడే. ఈ ప్రదేశంలో గురుద్వారాలే కాక, కొన్ని టెంపుల్స్ మరియు దర్గాలు కూడా కలవు. ఈ ప్రదేశం రూప్నగర్ – నంగల్ – చండి ఘర్ రోడ్డులో నేషనల్ హై వే 21 పై వుంటుంది.