మొరిండా లేదా బాగాన్ వాలా ను ‘ తోటల సిటీ’ గా పిలుస్తారు. ఈ ప్రదేశం ఒకప్పుడు పూర్తి తోటలతో వుండేది. ఇపుడు, నివాస ప్రదేశాలు ఏర్పడ్డాయి. ఇది నేషనల్ హై వే 95 పై కలదు. మ్జోరిండా లో ప్రధాన ఆకర్షణ అంటే శ్రీ కొత్వాలి సాహిబ్. ఈ ప్రదేశం లో గురు గోవింద్ సింగ్ జి తల్లి, మరియు ఆయన ఇరువురి కుమారులు ఫతే ఘర్ తీసుకు వెళ్ళే ముందు బంధించబడ్డారు. ఈ ప్రదేశం ప్రధాన హై వే మార్గాల మధ్య వుంది. రూప నగర్ కు 24 కి. మీ. ల దూరంలో కల ఈ ప్రాంతం లోని గురుద్వారా పర్యాటకులకు ఎంతో ప్రశాంత వాతావరణం అందిస్తుంది.