విరాట్ ఏ ఖాల్సా ను ఖాల్సా హెరిటేజ్ మెమోరియల్ కాంప్లెక్స్ అని కూడా అంటారు. దీనిని 13 సంవత్సరాల పాటు నిర్మించి 2011 లో పూర్తి చేసారు. ఈ మ్యూజియం లో ఉంచ బడిన వస్తువులు పర్యాటకులకు సిక్కు మతం ఎలా స్థాపించారు? ఖాల్సా పంత్ ఎలా ఏర్పడింది అనేవి వివరిస్తాయి. ఇక్కడ 400 మంది కూర్చున గల ఒక ఆడిటోరియం, , లైబ్రరీ, ఎక్సిబిషన్ గేలరీ లు కలవు. ఈ ప్రదేశ డిజైన్ ఆధునికం మరియు కోట తరహా శిల్ప శైలి కలిగి వుంటుంది. స్థానికంగా దొరికే రాళ్ళు బిల్డింగ్ అందాలను రెట్టింపు చేసాయి. టూరిస్ట్ లు విరాసత్ ఏ ఖల్స ను మంగళవారం నుండి ఆది వారం వరకు దర్శించ వచ్చు (ఉదయం 9.30 గం నుండి సా. 4 గంటల వరకు ) .